కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు – ఉద్యోగుల సమస్యలపై వైసీపీ అధినేత స్పందన
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన, తమ పాలనలో ఉద్యోగులకు 11 డీఏలు ఇచ్చామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 16 నెలలుగా అధికారంలో ఉన్నప్పటికీ 4 డీఏలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేసిన తర్వాతే కంటి తుడుపుగా ఒక డీఏ విడుదల చేసిందని జగన్ అన్నారు. ఉద్యోగులు ఏం పండ చేసుకోవాలని ప్రశ్నించిన తరువాతే జీవో సవరించారని గుర్తు చేశారు.
అలాగే నాలుగు పోలీసు సిబ్బంది సరెండర్ లీవ్స్ కూడా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలకు ఉద్యోగులు మోసపోయారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.